మహిళల భద్రత చట్టాలపై చర్చ జరగాలి: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే కిలో ఉల్లిని రూ. 25కు అమ్ముతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉల్లి అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉల్లి ధరల అంశంపై సీఎం జగన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ఇప్పటిదాకా 36,500 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి.. రైతు బజార్లలో కేజీ కేవలం రూ.25లకు అమ్ముతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్‌ లాంటి చోట్ల నుంచి ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇంత తక్కువ ధరకు ఉల్లి అందుబాటులో ఉందని వెల్లడించారు. అదే చంద్రబాబు హయాంలో మాత్రం ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు ధర లభించక.. పొలాల్లోనే వదిలేసిన పరిస్థితుల చూశామని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం తమ హయాంలో రైతులకు మంచిరేటు లభించడంతో పాటుగా.. వినియోగదారులకు కూడా నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.